కిరణ్ 24 x7 న్యూస్:
గూడూరు పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో బుధవారం సైబర్ నేరాల అవగాహన మరియు మహిళా భద్రత అవగాహన కార్యక్రమాన్ని గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజా కుళ్లాయప్ప ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగాఎస్ఐ రాజకుళ్లాయప్ప మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. అనంతరం ఆయన సైబర్ మోసాలు, వేధింపులు, పోక్సో చట్టం, బాల్య వివాహాలు మొదలైన వాటి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






