కిరణ్ 24×7 న్యూస్:
శ్రీసుంకులా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గూడూరు మండలంలోని కె.నాగలాపురం గ్రామం నందు దేవస్థానం తరపున సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో లక్ష్మీదేవి మొదటి బహుమతి పదివేల రూపాయలు,రెండవ బహుమతి కమ్మరి హేమలత, 5000 రూపాయలు,మూడో బహుమతి బెస్త రాధమ్మ 3000 రూపాయలు గెలుపొందారు.
దేవాదాయ శాఖ అధికారి పి. ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు భగవద్గీత పుస్తకాలు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నయోమి మండల కన్వీనర్ సురేష్ ఎస్సై అఖిల్ కుమార్ గ్రామ పెద్దలు గోపాల్ రెడ్డి మరియు యుగేందర్ మందుల సుంకన్న తిరుపాల్ వసంత కుమార్ , ఆలయ సిబ్బంది కేశవ పాల్గొన్నారు.







