కిరణ్ 24×7 న్యూస్: కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గూడూరు పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ బాబు ప్రసాద్ తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎస్సైని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నేరాలను నియంత్రించడంతో పాటు శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు.. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. అనంతరం డీఎస్పీ బాబు ప్రసాద్ సిసి కెమెరాలు, సిబ్బంది పని తీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ ఫైల్స్, చోరీలు, ఐటీ కేసుల స్థితిగతులపై రికార్డులను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పద్ధతులను పాటించాలన్నారు. పోలీస్స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సీఐ మహమ్మద్ తబ్రేజ్ . ఎస్సై తిమ్మయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






