కిరణ్ 24 x 7 న్యూస్:.మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో సభ్యులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని గూడూరు మండల తహశీల్ధార్ కే. రామాంజనేయులు కు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులజాబితాలో వున్న మదాసికురువ/మదారికురువ కులమార్పిడి రెవెన్యూ అధికారులు పాల్పడుతున్నారని అలాంటి చర్యలు జరగకుండా చూడాలని వారు కోరారు .మదాసికురువ/మదారికురువ లో కురువ అంతర్భాగం అనిమదాసికురువ/మదారికురువ సాధారణ ప్రజలు కురువ (లేదా) కురువొళ్ళు అని అంటారు అని కురువగా పిలువబడుతున్న మదాసికురువ/మదారికురువలను రెవిన్యూ అధికారులు Sc కులపత్రానికి బదులుగా ‘కురుబ’ BC-B అని మంజూరు చేస్తూ కుల మార్పిడికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కులమార్పిడి చట్టరీత్య నేరము అని .మదాసికురువ/మాదారికురువ హక్కుల సాధన సమితి సభ్యులు ధ్వజమెత్తారు.

ఈ కార్యక్రమంలో. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి గొర్రెల సహకార సంఘం డైరెక్టర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున గూడూరు మండల సంఘం నాయకులు టైలర్ దస్తగిరి, వెంకటేష్, మునిష్, రంగన్న, దినేష్, రాజు, వెంకటేశ్వర్లు, శివ, లక్ష్మన్న, మిన్నెల, శ్రీరాములు, మధు, సురేష్, ఆనంద్, భీమేష్, రమేష్, మరియు యువకులు పాల్గొన్నారు.