10 లక్షల 33 వేల విలువ గల గంజాయి ధ్వంసం …
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా .
కిరణ్ 24×7 న్యూస్:
ఏపీ డిజిపి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పర్యవేక్షణలో మంగళవారం భారీగా గంజాయిని ధ్వంసం చేసి నిప్పు అంటించి తగలబెట్టారు.
ఈ సంధర్బంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా మాట్లాడుతూ…
కర్నూలు జిల్లా లోని వివిధ పోలీసుస్టేషన్ ల పరిధులలో 27 కేసులలో స్వాధీనం చేసుకున్న 126 కేజీ ల గంజాయిని కర్నూలు నగర సమీపంలోని దిన్నేదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు, రెవిన్యూ అధికారులు కలిసి ధ్వంసం చేశామన్నారు.

పెండింగ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కోర్టు మెజిస్ట్రేట్ అనుమతితో , NDPS Act ప్రకారం ప్రోసిడింగ్స్ చేసి పంచనామా ప్రకారం గంజాయిని ధ్వంసం చేసి కాల్చి వేయడం జరిగిందన్నారు.
దహనం చేసిన గంజాయి విలువ రూ. 10 లక్షల 33 వేలు ఉంటుందన్నారు.
జిల్లాలో గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక దృష్టి ఉంచామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ తో పాటు ఎక్సైజ్ అడిషనల్ ఎస్పీ సుధీర్ బాబు , కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్, ఎక్సైజ్ డిఎస్పీ రామకృష్ణా రెడ్డి, నోడల్ ఆఫీసర్ సిఐ గుణశేఖర్ బాబు, సిఐలు తేజమూర్తి, విక్రమసింహ, శేషయ్య, నాగరాజారావు, ఇతర ఎస్సైలు పాల్గొన్నారు..







