kiran24×7news :
గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న 14 మంది వాలంటీర్లు గురువారం తమ విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ తమ రాజీనామా పత్రాన్ని ఎంపీడీవో జయశ్రీ గారికి అందజేశారు.. సచివాలయంలో పనిచేస్తున్న (సురేష్, ప్రకాష్,ప్రసాద్,విజయ భాస్కర్,స్వామీదేవి,స్వర్ణ కుమారి) మరి కొంతమంది వాలంటీర్లు రాజీనామ చేసి తమ ముకుమ్మడి రాజీనామా పత్రాలను ఎంపీడీవో జయశ్రీ గారికి అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరి కొంతమంది వాలంటీర్లు కూడా తమ విధులకు రాజీనామా చేసి త్వరలోనే తమ రాజీనామా పత్రాలను ఎంపీడీవో గారికి అందజేస్తారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు…






