గూడూరు పల్లెవాణి( కిరణ్)
గూడూరు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని యువకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ అంబేద్కర్ న్యాయకోవిదుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ అందరూ ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిష్ కుమారు మరియు యువకులు పెద్దలు పాల్గొన్నారు.






