కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల మృతి..

కిరణ్ 24×7 న్యూస్: కర్నూలు లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఇద్దరు యువకులు మరణించగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కర్నూలు సంతోష్ నగర్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వస్తున్న సమయంలో టిప్పర్ బైక్ రెండు ఢీకొని ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈప్రమాదంలో కోడుమూరు నియోజకవర్గం గూడూరు కు చెందిన చంద్రశేఖర్ (31) నవీన్(32) అక్కడికక్కడే మృతి చెందగా సుమన్(32) తీవ్ర గాయాలు అయ్యాయి. సుమన్ ను చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఘటన స్ధాలానికి ట్రాఫిక్ పోలీసులు, నాలుగో పట్టణ పోలీసులు వెంటనే చేరుకోని సహయక చర్యలు చేపట్టారు. ఈప్రమాదం సందర్భంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ధర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.