నమ్మకద్రోహం , దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ …
కిరణ్ 24×7 న్యూస్:
కోడుమూరు రోడ్ లో మహేక్ ఎంటర్ప్రైసెస్ సానిటరీ షాప్ కలదు. యజమాని సల్మాన్ బాషా అందులో పని చెేయడానికి గుమస్తా గా ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ని నియమించుకొని నెలకు రూ. 10 వేల జీతం ఇస్తూ కావాల్సిన సదుపాయాలు కల్పించినాడు.
సదరు గుమస్తా మీద పూర్తి నమ్మకంతో షాపు నిర్వహణ అంతా అతనికి వదిలేసి ఉండగా, ఇదే అదనుగా భావించిన గుమస్తా ప్రవీణ్ కుమార్, యజమానికి అనుమానం రాకుండా అతనికి తెలియకుండా అతని స్నేహితుడైన పవన్ కళ్యాణ్ అనే ఆటో డ్రైవర్ తో మాట్లాడుకొని గత 5 నెలలుగా ఇద్దరూ కలిసి యజమాని లేని సమయం లో సదరు షాపు లోని సానిటరీ వస్తువులు అనగా commods, వాష్ బేసిన్ లు, హ్యాండ్ వాష్ బేసిన్స్, కిచెన్ ఐటమ్స్ ఇలా రక రకాల ఐటమ్స్ ను వీరు ఇద్దరు కలిసి దొంగలించి వారి యజమానే పంపించినట్టుగా బయటి వారిని నమ్మిస్తూ సుమారు రూ. 7 లక్షల విలువ చేసే వస్తువులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.
యజమాని సల్మాన్ ఇచ్చిన ఫిర్యాదు పై నమ్మకద్రోహం, దొంగతనం కింద కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు లో వీరు ఇరువురు సదరు నేరానికి పాల్పడినారు అని ధ్రువీకరించుకొని, వారిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారించారు.
వారు దొంగతంగా అమ్ముకున్న వస్తువులను అన్నిటిని రికవరీ చేసుకొని సదరు యజమానికి అప్పగించి సదరు నేరానికి పాల్పడిన ఇద్దరిని రిమాండ్ కి పంపడం జరిగింది….
ఈ కార్యక్రమంలో నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా తో పాటు ఎస్సైలు చంద్రశేఖర్, శరత్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.






