కర్నూలు జిల్లా…
• జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు.
kiran24×7news :-
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్ర సాయుధ బలగాలతో కలిసి జిల్లా పోలీసులు ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు, ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహిస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికలలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.
ఈ రోజు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు
జిల్లాలోని కర్నూలు, ఆదోని, పత్తికొండ సబ్ డివిజన్ లలోని పలు ప్రాంతాలలో కేంద్ర సాయిధ బలగాలైన “సశస్త్ర సీమా బల్” సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు.
గూడూరు పోలీసుస్టేషన్ పరిధిలోని సుంకేశుల, ఆర్ . ఖానా పురం , రేమట గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో కోడుమూరు సిఐ మనసురుద్దీన్ , గూడూరు ఎస్సై హనుమంతయ్య మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.
హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని సిద్దాపురం, అమృతపురం, వల్లూరు గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.హాలహార్వి ఎస్సై నరేంద్ర మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఆదోని ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాస భవన్, ఖాజీపుర, ఎన్ టిఆర్ కాలనీ, టిజిఎల్ కాలనీ, పెద్దమసీదు, మరాఠీ గేరి, బబ్బులమ్మాగుడి, బోయగేరి కేంద్ర సాయుధ బలగాలతో పోలీసులు కవాతు నిర్వహించారు.ఆదోని ఒన్ టౌన్ సిఐ తేజ మూర్తి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






