టిడిపి పార్టీ మండల అధ్యక్షులను మార్పు చేయలేదు….

టిడిపి పార్టీ కోడుమూరు నియోజకవర్గం లోని మండల అధ్యక్షులను వారి పదవులను ఎలాంటి మార్పులు చేయలేదని టిడిపి పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బిటి నాయుడు ప్రకటనను విడుదల చేశారు..

కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశంపార్టీ గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండలముల పార్టీ అధ్యక్షులను మార్పు చేయలేదు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు బీ.టి.నాయుడు

కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షులను మార్పు చేసినట్టుగా నిన్నటి దినం దినపత్రికలలోను, సోషల్ మీడియాలోను ప్రచ్రితమైనట్లు రాష్ట్ర పార్టీ దృష్టికి సమాచారం తెలిసినందున ఈ అంశం గురించి పూర్తిగా తెలుసుకునే నిమిత్తం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌ.॥ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పూర్తి స్థాయి. సమాచారమును తెలియజేయవలసిందిగా జిల్లా పార్టీని ఆదేశినందున ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయం, కర్నూలు నందు పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ బీ.టి.నాయుడు, జోన్ 5 కో ఆర్డినేటర్ శ్రీ బీద రవిచంద్రయాదవ్, యం.యల్.సి శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు శ్రీనివాస మూర్తి గార్లు ఈ విషయమై పూర్తిగా సమాచారమును సేకరించడం జరిగింది. ఈ విధంగా మార్పులు చేయడం పార్టీ నియాపలికి విరుద్ధం అవుతుంది. ఈ మండలాలకు సంబందించిన కర్నూలు మండలం పార్టీ అధ్యక్షులు శ్రీ శివశంకర్ నాయుడు, గూడూరు మండలం పార్టీ అధ్యక్షులు శ్రీ సుధాకర్ రెడ్డి, సి.బెళగల్ మండలం పార్టీ అధ్యక్షులు శ్రీ గోవింద్ గౌడ్ గార్లు ఆయా మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారని తెలియజేశారు. పత్రికలలోనూ, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లకు జిల్లా పార్టీకి ఏ విధమైన సంభందం లేదని తెలిపారు.

24014/24

బీ.టి.నాయుడు

యం.యల్.సి కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు.