కిరణ్ 24×7 న్యూస్;
బుధవారం ఆదోని పట్టణంలో జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తో కలిసి పర్యటించారు.
ఇస్వి పోలీసుస్టేషన్ పరిధిలోని చిన్న హరి వాణo గ్రామ సమీపంలో ఉన్న ఎల్ ఎల్ సి కెనాల్ లో గణేష్ ఉత్సవ కమిటి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ఘాట్ ను పరిశీలించారు.
బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు , సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు, సలహాలు చేసి దిశా నిర్దేశం చేశారు.
గణేష్ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పూజలో ఎస్పీ పాల్గొన్నారు.
కెసి కెనాల్ నీటి ప్రవాహాన్నీ, భారీ క్రేన్స్ , స్విమ్మర్స్ , బోట్ల ను పరిశీలించారు.
ఆదోని పట్టణంలో నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.
ప్రజలకు అసౌకర్యం , ట్రాఫిక్ అంతరాయం వంటివి లేకుండా చూడాలన్నారు.
నిమజ్జన సమయంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో గట్టిగా పని చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ వెంట ఆదోని డిఎస్పీ సోమన్న , పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య, హోంగార్డ్ డిఎస్పీ కృష్ణమోహన్ , ట్రైన్ డిఎస్పీ ధీరజ్ , సీఐలు ప్రసాద్, కేశవరెడ్డి, పవన్ కిశోర్, నల్లప్ప, గంట సుబ్బారావు, గణేష్ ఉత్సవ కమిటి సభ్యులు, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.






