కిరణ్ 24 x7 న్యూస్ ; కర్నూలు జిల్లా గూడూరు మండలము, కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధి లో సోమవారం కుర్నూలు టు బళ్ళారి రోడ్డు లో ఎస్సార్ పెట్రోలో బుంకు సమీపంలో అనుమానాస్పద స్దితి లో రాత్రి సుమారు 09:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తిని, గుర్తు తెలియని వాహనం డి కొనడం వలన రక్త గాయాలు కలిగి రోడ్డుపై పడి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించి మృతదేహాన్ని కర్నూలు మార్చరికి తరలించారు. ప్రమాదానికి గురైన వ్యక్తి లేత గులాబీ రంగు టి షర్టు (పింకూ కలర్ ) మరియు నలుపు తెలుపు నీలువు గీతల పాయింటు ధరించి ఉన్నాడు, మరియ కుడిచేతిపైన హరిత లవ్ అనే సింబల్ పచ్చబొట్టు కలదు, సదరు వ్యక్తి పుట్టుమచ్చలు,కుడిపక్క ఎదపైన ఒక నల్లటి పుట్టుమచ్చ కలదు, మరియు ఎడమవైపు పొట్టపైన ఒక నల్లటి పుట్టుమచ్చ కలదు,కె.నాగలాపురం పోలీస్ వారు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీ నందు మృతదేహాన్ని భద్ర పరచడమైనది, కె.నాగలాపురం పోలీస్ వారు రక్తసంబంధీకులు ఎవరు రానందున వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైనది. ఎవరైనా మృతుడి గురించి వివరాలు తెలిసిన యెడల, కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ కు తెలుపగలరు అని, K.నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆశలత ఫోన్ నెంబర్ 9121101068, మరియు కర్నూలు రూరల్ సీఐ చంద్ర బాబు నాయుడు,ఫోన్ నెంబర్ 9121101065, కు సమాచారం ఇవ్వవలసిందిగా తెలిపారు.