కిరణ్ 24 x7 న్యూస్ ;
ఆరోగ్య శ్రీ క్రింద పేషెంట్ల నుండి నగదు వసూలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను అదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం అనేది నగదు రహితంగా నిర్వహించే పథకమని అందులో నగదు తీసుకోవడం ఏంటని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలను కలెక్టర్ ప్రశ్నించారు?? ఆరోగ్య శ్రీ పథకంలో కవర్ కానీ చికిత్సలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం ఆసుపత్రి యాజమాన్యాలు నగదు తీసుకున్నారనే వివరాలను ఫిర్యాదు రూపంలో పేషంట్ల నుండి ఏ విధంగా తీసుకుంటారని కలెక్టర్ ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్ ను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రులపై వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి డిఎంహెచ్ఓ, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ నెలలో ఒకసారి సబ్ కమిటీ స్థాయి సమావేశం నిర్వహించుకొని ఫిర్యాదులపై వివరణ తీసుకోవాలని సదరు కమిటీ వివరణకు సంతృప్తి చెందకపోతే ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే జిల్లా స్థాయి కమిటీలో ఫిర్యాదును పరిశీలించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండగా ఎందుకు నగదు తీసుకుంటారని కలెక్టర్ ఆరా తీశారు.. పేషెంట్ వచ్చిన వెంటనే పలు పరీక్షల కోసం పేషెంట్ నుండి నగదును తీసుకోవడం జరుగుతుందని, తదనంతరం ఆరోగ్యశ్రీ లో నమోదు అయితే నగదును తిరిగి ఇవ్వడం జరుగుతుందని ఆసుపత్రి యాజమాన్యాలు కలెక్టర్ కి వివరించారు .. కలెక్టర్ స్పందిస్తూ అలా కాకుండా ముందుగా పరీక్షలు నిర్వహించి ఆ తరువాత పేషెంట్ ఆరోగ్య శ్రీ క్రింద వస్తే ఉచితంగా చికిత్స ఇవ్వాలని లేకపోతే అప్పుడు వారి నుండి నగదు తీసుకునే ప్రక్రియను అన్ని ఆసుపత్రులు పాటించాలన్నారు. జిల్లాలో వివిధ ఆసుపత్రులకు సంబంధించి ఇప్పటి వరకు 174 ఫిర్యాదులు రాగా అందులో 134 వరకు నగదును పేషంట్లకు ఆసుపత్రి యాజమాన్యాలు తిరిగి చెల్లించారన్నారు. ఆసుపత్రులు పేషంట్లకు నగదు తిరిగి చెల్లించే విధానానికి ఇప్పటి నుంచి అయిన స్వస్తి పలకాలని కలెక్టర్ ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు.
ఆసుపత్రుల ఫిర్యాదులను కేసు వారీగా రివ్యూ చేస్తూ పెండింగ్ ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ నుంచి తొలగించిన ఆసుపత్రులపై ఏమైన కేసులు ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.ఎంవిఎన్ఎస్వి.భాస్కర్ రెడ్డి, ఇంఛార్జి డిఎంహెచ్ఓ ఎల్.భాస్కర్, ఇంఛార్జి డిసిహెచ్ఎస్ డా.రామకృష్ణ, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.






