గూడూరు పల్లె వాణి:
గూడూరు వైద్య కేంద్రం పరిధిలోని పూలకుర్తి గ్రామం లో స్వస్థనారి శాసక్త్ నరిపరివార్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఇందులో భాగంగా ప్రజలకు బీపీ,షుగర్, క్యాన్సర్ లపై అవగాహన కలిగించి గర్భవతులకు,రక్త పరీక్షలు చేసి సరియైన చికిత్స చేయడం జరిగింది. 60 సంవత్సరాల పైబడినవారికి ఆరోగ్య పరిక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైద్యులు మదన్ శేఖర్ మరియు వైద్య సిబ్బంది కృష్ణారెడ్డి రాఘవయ్య విజయభారతి ప్రభావతి మహాలక్ష్మి శ్వేత ఆశ వర్కర్లు సిబ్బంది పాల్గొన్నారు.