చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ …. కర్నూలు డిఎస్పీ  బాబు ప్రసాద్.

దొంగలించబడిన మొత్తం సొత్తు రికవరీ.

Kiran 24×7 news

20 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు రికవరి చేసిన … కర్నూలు పోలీసులు.

కర్నూలు డిఎస్పీ కార్యాలయం లో నిందితుల వివరాలను వెల్లడించిన … కర్నూలు డిఎస్పీ.

జరిగిన విషయం…

కర్నూల్ నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లోని అమీన్ అబ్బాస్ నగర్ కు చెందిన వెంకట సుబ్బయ్య గారు పేపర్ మిల్ లో పని చేస్తూ రిటైర్ అయ్యారు. ఒక కార్యం నిమిత్తం 2026 మార్చి 27 న న కడప కి వెళ్ళాడు.

2026 మార్చి 29 అర్ధ రాత్రి సమయం లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటి తాళాలు పగులకొట్టి ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న పోలీసు ఉన్నతాధికారులు

ఇంటిలోని బీరువా తాళాలు పగులగొట్టి అందులోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి ఆభరణాలు దొంగలించుకోపోయారన్న ఫిర్యాదు పై కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు పరిచారు.

కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు కర్నూల్ డిఎస్పీ శ్రీ బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహ, కర్నూలు త్రీ టౌన్ శేషయ్య, ఎస్సై చంద్ర శేఖర్ రెడ్డి, క్రైమ్ పార్టీ పోలీసులు మురళీధర్, సుబ్బారాయుడు, వాసు, సుంకన్న, చెంచన్న, శేఖర్ లు ప్రత్యేక బృందాలుగా ఏర్ప డ్డారు.

దర్యాప్తులో భాగంగా అందుబాటులో ఉన్న CC TV ఫుటేజ్ లను పరిశీలించారు.

దొంగతనానికి పాల్పడిన నిందితులు బాలాజీ నగర్ లో నివాసముండే ఇద్దరు మైనర్ లుగా గుర్తించారు.

ఈ రోజు ఉదయం మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద వారిని అరెస్ట్ చేాశారు.

వారి నుండి దొంగతనం చేయబడిన మొత్తం సొత్తును రికవరీ చేసి వారిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పెట్టడమైనది.

వీరు గతం లో కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో గణేష్ నగర్ నందు RTC DM వారి ఇంట్లో కూడా దొంగతనానికి పాల్పడ్డారు.

ప్రజలకు ముఖ్య గమనిక :

ఎండాకాలం అని ఇంటికి తాళాలు వేసి ఆరుబయట /ఇంటి మీద పడుకొనే వారు, బయటి ప్రాంతాలకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మన అజాగ్రత్త దొంగలకు ఆదాయం వనరు అని, అప్రమత్తంగా ఉండాలని కర్నూలు డిఎస్పీ  జె. బాబు ప్రసాద్  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.