గూడూరు పోలీస్ స్టేషన్ నుండి నలుగురు కానిస్టేబుళ్ల బదిలీ…

kiran24×7news :-

పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ మధుశేఖర్, సునీత, లోకేశ్, మధుగోపాలను ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. వీరంతా సొంత మండలమైన గూడూరు మండలానికి చెందిన వారు కావడం గమనార్హం. ఎన్నికల నిబంధనల మేరకు సొంత నియోజకవర్గంలో విధులు నిర్వహించకూడదన్న ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఐపీఎస్ ఆ నలుగురు కానిస్టేబుళ్లను ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు రిలీవ్ చేసినట్లు గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంతయ్య ఈ సందర్భంగా తెలిపారు.