kiran24x7news;
ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు.
ఇందులో భాగంగా సి. బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలైనా పోలకల్ గ్రామం, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారు పరిశీలించారు.అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.
పోలీంగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి అక్కడి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా గట్టి చర్యలు చేపట్టాలని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, సి. బెలగళ్ పోలీసుస్టేషన్ ఎస్సై తిమ్మా రెడ్డి ఉన్నారు.






