కిరణ్ 24×7 న్యూస్;
కర్నూలు నుండి గూడూరు ట్రాన్స్కో సబ్స్టేషన్ కు వచ్చే 132 కె.వి లైన్ సామర్థ్యం పెంపు కొరకు కండక్టర్ /వైర్ మార్పు పనులు జరుగుతునందున గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని అగ్రికల్చర్ ఫీడర్లకు 3-ఫేజ్ సప్లై (వ్యవసాయ బావులకు/బోరులకు, పంచాయితీ నీటి సరఫరా కొరకు) వేళల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లుగా గూడూరు సబ్ డివిజన్ ట్రాన్స్కో ఏఈ శ్రీనివాస్ నాయక్ తెలియజేశారు.
గ్రూప్- ఏ టైమింగ్ :
ఉదయం 05:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00గంటల వరకు
మరియు
రాత్రి 9:00గంటల నుండి 11:00 గంటల వరకు
గ్రూప్- బి టైమింగ్ :
రాత్రి 03:00 గంటల నుండి 05:00గంటల వరకు
మరియు మధ్యాహ్నం 12:00గంటల నుండి సాయంత్రం 07:00గంటల వరకు ఇవ్వడం జరుతుంది. ఈ విషయాన్ని గమనించి రైతులు,ప్రజలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు సహకరించాలని కోరుతున్నాము.






