కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు మండలం ఈ తాండ్రపాడు, గొందిపర్ల, రేమట, కర్నూల్ పట్టణ 38వ వార్డు గీత ముఖర్జీ నగర్ కు చెందిన టిడిపి కార్యకర్తలు ఈరోజు వైసిపి పార్టీలోకి చేరారు..
వీరికి కూడా చైర్మన్ శ్రీ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు సమక్షంలో కర్నూల్ పార్లమెంట్ టిడిపి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ సాహెబ్, కర్నూల్ మండల టిడిపి కన్వీనర్ బి.శివ శంకర్ నాయుడు, గీత కార్మికుల ఆర్గనైజింగ్ సెక్రటరీ యూనిట్ ఇంచార్జ్ ఈ.సురేంద్ర గౌడ్, కొంతలపాడు బూత్ ఇంచార్జ్ బి నారాయణ, ఎస్సీ సెల్ మండల కార్యదర్శి బి. శ్రీనివాసులు, రేమట ఎస్.మాభాషా, ఇ.తాండ్రపాడు మియ్యషా ఖాద్రీ, కర్నూల్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎం నిజాముద్దీన్, ఇ.తాండ్రపాడు ఎం.లక్ష్మన్న, రేమట బి.దేవన్న, బి.శివాంజనేయులు, బి.మల్లికార్జున్, బి.రంగడు, ఇ.తాండ్రపాడు ఎం మదర్ సాహెబ్ గార్లకు పార్టీ కండువా కప్పి వైసిపి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ సందర్భంగా పార్టీలోకి చేరిన కార్యకర్తలు మాట్లాడుతూ జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఆకర్షితులమై పార్టీలోకి చేరినట్లు తెలిపారు అదేవిధంగా రానున్నది జగనన్న ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.. అలాగే కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీష్, కర్నూలు ఎంపీ అభ్యర్థి బి వై రామయ్య గార్లను అధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా అందిస్తామని తెలిపారు..
కార్యక్రమంలో కర్నూల్ పట్టణ 40 వార్డు కార్పొరేటర్ విక్రమ్ సింహా రెడ్డి, గొందిపర్ల సర్పంచ్ శ్రీనివాసులు, బోయ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు







