kiran24×7news ;
గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన వాలంటీర్లు స్వచ్ఛందంగా శనివారం తమ విధులకు రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు.. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను వాలంటీర్లు గూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీ కి అందజేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ తాము విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లుగా తెలుపుతూ ..మరి కొంతమంది వాలంటీర్లు కూడా త్వరలోనే తమ విధులకు రాజీనామా చేస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.






