కిరణ్ 24×7 న్యూస్: కోడుమూరు పట్టణంలో హంద్రీ ఒడ్డున వెలసిన చదువుల తల్లి శ్రీ శ్రీ శ్రీ వల్లేలాంబ దేవి (సరస్వతి దేవి) దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మ వారు సరస్వతి దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. అమ్మ వారికి నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, మరియు కోడుమూరు నియోజవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భక్తులతో కలిసి పల్లకి సేవలో పాల్గొని అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొని వారి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, మండల కన్వీనర్ రమేష్ నాయుడు, ప్రతాప్ రెడ్డి, రామకృష్ణ రెడ్డి, మల్లారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, లింగమూర్తి , ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.