గూడూరు, పల్లెవాణి : (కిరణ్)
గూడూరు పట్టణంలో సోమవారం భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను , ప్రజాప్రతినిధులు, ప్రజలు యువకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో ఉన్న బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన సేవలను కొనియాడారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, కళాశాలలో నే కాక ప్రజలందరూ ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో
నిరంజన్ బుడంగలి కౌన్సిలర్ మాధవరావు నందకిషోర్ ఇమ్మానుయేలు వినోద్ మధు లక్ష్మణ్ బాబు ప్రసాద్ నాగరాజు అశోక్ రాజు శ్రీను జార్జి రాకేష్ బుజుగు మధు చిన్నోడు కోతి జానీ విల్సన్ పాల్గొన్నారు






