కర్నూల్ న్యూస్ (కిరణ్)
ఫెన్సింగ్ క్యాడెట్ (అండర్ 17) జిల్లా స్థాయి చాంపియన్ షిప్ పోటీలను డాక్టర్ శంఖర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా డాక్టర్. శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. ఫిన్షింగ్ గేమ్ క్రీడాకారుల వ్యక్తిగత ప్రతిభ పై ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. ఈనెల 30న భీమవరం లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు క్రీడాకారులు విజయం సాధించాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. ఫెన్సింగ్ గేమ్ ఎంతో ప్రాచీనమైనదని రాజుల కాలం నుంచి ఉందన్నారు. భారత దేశంలో 1997లో ఫిన్షింగ్ గేమ్ అధికారికంగా గుర్తింపు పొందిదని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా అమ్మాయిలు ఎంతో జాగ్రత్తలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్. శంకర్ శర్మ తెలియజేశారు.స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చిన్నారుల, యువత దోరణి మారిందని తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించాలన్నారు.ఈకార్యక్రమంలో సీసీఎస్
సీఐ. నాగశేఖర్,కర్నూలు ఫిన్షింగ్ కోచ్ మహేష్, నంద్యాల కోచ్ లక్ష్మీ నారాయణ,మణికంఠ, కాలి, సాయి తదితరులు పాల్గొన్నారు.






