గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా పై పోరాటం ఆగదు.

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు.

కిరణ్ 24×7 న్యూస్:

కోడుమూరు పట్టణంలో ఉన్న గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వక్తలు పేర్కొన్నారు. కోడుమూరు పట్టణంలో ఆదివారం ఉదయం యూత్ రిక్రియేషన్ సెంటర్ లో అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోడుమూరు గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ పట్టాలు సృష్టించుకొని లైబ్రరీ స్థలం కబ్జా చేస్తే పోరాటం చేయక తప్పదని వక్తలు పేర్కొన్నారు. దొంగ పట్టాలు సృష్టించుకొని గ్రంథాలయ స్థలం కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేస్తుంటే కోడుమూరు గ్రామ పంచాయతీ ఏమి చేస్తోందని నిలదీశారు.

గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అన్ని తెలిసినా ఎందుకు మిన్నకుండ చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే గ్రామ పంచాయతీ కబ్జా చేస్తున్న వారికినోటిస్ లు ఇచ్చి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గ్రామ పంచాయతీ పాలక వర్గం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్నును ప్రజలు గ్రామ పంచాయతీ కు చెల్లిస్తుంటే గ్రామ పంచాయతీ గ్రంథాలయ సంస్థ స్థలంలో అక్రమ కట్టడాలు జరుగుతుంటే గ్రామ పంచాయతీ నిద్ర పోతుందా అని నిలదీశారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సోమవారం రాత్రి వరకు సమయం ఇచ్చి మంగళవారం నుండి అక్రమ నిర్మాణం పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సబ్యులు అభిప్రాయపడ్డారు.

మంగళవారం నుండి మన కోడుమూరు మన గ్రంథాలయం పేరుతో కోడుమూరు గ్రంథాలయ స్థలము ను పరిరక్షించుకుందామని వక్తలు సూచించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకొని అక్రమ నిర్మాణం ఆపాలని, ప్రభుత్వ స్థలం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు.