ముఖ్యమంత్రి గారి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత …
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ .
* 1200 మంది పోలీసులతో భారీ బందోబస్తు.
* పోలీసులు అప్రమత్తంగా ఉండాలి.
ఏర్పాట్ల పై ఆరా తీసి పరిశీలించిన … కర్నూలు ఎస్పీ .
కిరణ్ 24×7 న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు మండలం , కలుగొట్ల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో హెలిప్యాడ్, ప్రజావేదిక ఏర్పాట్లను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ , ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ భద్రత ఏర్పాట్లను బుధ వారం పరిశీలించారు.

ముఖ్యంత్రి హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ , ఇతర భద్రత ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పటిష్ణ భద్రత కు పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి మాట్లాడారు.
ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంయుక్తంగా రెవిన్యూ , పోలీసులు గౌరవ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.
గౌరవ ముఖ్యమంత్రి పర్యటించే రూట్ & రూఫ్ – టాప్ ప్రాంతాలలో, సిఎం కాన్వాయ్, సభ ప్రాంగణం , తదితర ప్రాంతాలలో బందోబస్తు విధులు నిర్వహించే మఫ్టీ పోలీసులు , స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు , పోలీసు జాగీలాలు , బాంబ్ స్క్వాడ్ బృందాలతో పోలీసు అధికారులు , పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏలాంటి సంఘటనలు జరగకుండా భద్రత పరంగా పకడ్బందీగా విధులు నిర్వహించాలన్నారు.
వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు.

కర్నూలు, కడప, నంద్యాల, అన్నమయ్య జిల్లాల పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు.
ఇందులో జిల్లా ఎస్పీ గారితో పాటు ముగ్గురు అడిషనల్ ఎస్పీలు , 8 మంది డిఎస్పీలు, 55 మంది సిఐలు, 88 మంది ఎస్సైలు , 297 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుళ్ళు , 485 మంది కానిస్టేబుళ్ళు , 61 మంది మహిళా పోలీసులు, 191 మంది హోంగార్డులు, 2 సెక్షన్ల ఎఆర్ పోలీసులు, 14 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించారు.

జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ లతో పాటు సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్ , ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ , ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, హోంగార్డు డిఎస్పి ప్రసాద్ , కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు , టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ , సిఐలు, ఎస్సైలు ఉన్నారు.






