
కిరణ్ 24×7 న్యూస్:
కర్నూలు పట్టణంలోని ఏ క్యాంప్ లోని మైపర్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ ఇంటర్వ్యూలలో 30 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వరించాయి.. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ మైపర్ ఫార్మసీ కళాశాలలో ఇండియన్ లాజికల్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ ఇంటర్వ్యూలలో 150 మంది విద్యార్థులు పాల్గొనగా 30 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వారికి కంపెనీ ఆఫర్ లెటర్ ను అందజేసినట్లుగా ఆయన తెలిపారు. మైపర్ ఫార్మసీ కళాశాలలో చదివిన విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని వారికి ఉద్యోగ అవకాశాలు వెంటనే అందుబాటులోకి వస్తున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కాసర్ల సురేష్ అకాడమిక్ డీన్ రాజ్ కుమార్ ప్లేస్మెంట్ అధికారి ప్రశాంత్ తరులు పాల్గొన్నారు.