*హర్షన్న, సతీషన్న* సల్లంగుండాలే!
గూడూరు పట్టణం…
కర్నూలు నుంచి వచ్చిన వాహనం నెమ్మదిగా ఆగింది. వాహనం దిగుతున్న వారు సాధారణ ప్రయాణికులు కాదు. కొన్ని గంటల క్రితమే కంటి ఆపరేషన్ చేయించుకుని, జీవితంలో మళ్లీ వెలుగులు చూసే ఆశతో తిరిగి వస్తున్న నిరుపేదలు.
వారి కళ్లలో ఇంకా కట్టులు ఉన్నా… ముఖాల్లో మాత్రం అపారమైన ఆనందం.
వారిని ఆ వాహనంలో తీసుకొచ్చింది ఎవరో డ్రైవర్ కాదు.
*వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్* గారి సొంత వాహనం.
ఇది ఒక కార్యక్రమం కాదు…
ఇది ఒక మనిషి మరో మనిషి కోసం చేసిన నిజమైన సేవ.
మాట కాదు… చేసిన పని
“ *జగనన్న పుట్టినరోజు* కానుకగా… ఏడాదంతా కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తాం” అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ *కోడుమూరు నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్* గారు నియోజకవర్గ ప్రజలకు మాటిచ్చారు. తన రాజకీయ గురువు, *కుడా మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి గారి* ప్రోత్సాహంతో గత ఏడాది డిసెంబర్ 21న గూడూరు టౌన్లో *డాక్టర్ ఆదిమూలపు సతీష్* ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆ రోజు గ్రామీణుల జీవితాల్లో వెలుగుల పండుగగా మారింది.
దృష్టిలోపంతో బాధపడుతూ,
డబ్బులు లేవు… ఆస్పత్రికి వెళ్లలేము…
అని చూపు కోల్పోయే అంచున ఉన్న అనేక మంది పేదలకు ఈ కార్యక్రమం ఆశాకిరణంగా మారింది. ఈ నెల 6వ తేదీన వైద్యులు నిర్ధారించిన పేదలకు కర్నూలులో *డాక్టర్ ఆదిమూలపు సతీష్* గారు దగ్గరుండి ఆపరేషన్లు చేయించారు.
ఆపరేషన్ తర్వాత… ఇంటికి చేరే వరకు బాధ్యత
కంటి ఆపరేషన్ అయిపోయింది అంటే సరిపోదు. ఆపరేషన్ తర్వాత వారి భద్రత, మనోధైర్యం, ఇంటికి చేరే వరకూ భరోసా కూడా అవసరం.
అందుకే…
కర్నూలు లో *డాక్టర్ ఆదిమూలపు సతీష్* గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి,
ఆ తర్వాత ఆ రోగులను తానే స్వయంగా తన వాహనంలో ఎక్కించుకుని గూడూరుకు తీసుకొచ్చారు.
“మీరు ఇక భయపడాల్సిన అవసరం లేదు…
మీ చూపు మా బాధ్యత”
అన్న మాట, వారి హృదయాల్లో గాఢంగా మిగిలిపోయింది.
సేవ వెనుక ఉన్న నాయకత్వం
ఈ సేవా కార్యక్రమానికి బలమైన అండగా నిలిచింది *వైయస్ఆర్సీపీ ఎస్ఈసీ సభ్యులు, కుడా మాజీ చైర్మన్, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త*
*కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గారి* నాయకత్వం. ఆయన ప్రోత్సాహంతోనే ప్రతి గ్రామంలో కంటి వైద్య శిబిరాలు,
ఉచిత మందులు, కళ్లద్దాలు, అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ఇది పార్టీ కార్యక్రమం కాదు…
ప్రజల జీవితాలకు వెలుగు నింపే యజ్ఞం
ఈ కార్యక్రమంలో వృద్ధులు, రైతులు, కూలీలు, మహిళలు ఎవరైనా సరే…
“డబ్బు లేదు” అన్న మాట వినిపించదు.
ఇది రాజకీయ లబ్ధి కోసం కాదు.
ఇది జగనన్న బాటలో సేవా రాజకీయాల నిజమైన ప్రతిరూపం.
వెలుగులు చూసిన కళ్లతో… కృతజ్ఞతలు
కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు
ఇంటికి చేరిన తర్వాత ఒక్కటే మాట అంటున్నారు —
“ఇక మళ్లీ మా జీవితంలో చీకటి లేదు…
మాకు చూపు ఇచ్చినవారు మా దేవుళ్లు.”
*హర్షన్న, సతీషన్న* సల్లంగుండాలే
కోడుమూరు నియోజకవర్గంలో
ఈ ఏడాది ప్రారంభమైన ఈ కంటి వెలుగు కార్యక్రమం, వచ్చే జగనన్న పుట్టినరోజు నాటికి
వేలాది మందికి చూపును తిరిగి ఇచ్చి వారి జీవితాల్లో నిజమైన వెలుగులు నింపనుంది.
కళ్లకు వెలుగు… ముఖాల్లో మాత్రం అపారమైన ఆనందం
కోడుమూరులో సేవా రాజకీయాలకు సజీవ ఉదాహరణ







